టెంపర్తో సక్సెస్లో వున్న ఎన్టీఆర్, 1
నేనొక్కడినే చిత్రంతో కాస్త వెనకపడిన సుకుమార్ కాంబినేషన్లో ఓ సినిమా
చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్
లండన్లో జూన్ మొదటివారంలో స్టార్ట్ కాబోతోంది. స్పెయిన్లో మ్యూజిక్
సిట్టింగ్స్ జరుపుకున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ని మొదట లండన్లోనే
మే 1న స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల జూన్
మొదటివారానికి పోస్ట్పోన్ అయింది. సుకుమార్ చిత్రాలన్నింటికీ
సూపర్హిట్ పాటల్ని అందించిన దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రం కోసం కూడా
అద్భుతమైన సాంగ్స్ని సిద్ధం చేశాడట. ఇప్పటికే 5 పాటల ట్యూన్స్ రెడీ
చేశాడు దేవి.
సాహసం, అత్తారింటికి దారేది చిత్రాలను రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్తో
కలిసి నిర్మించిన బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఆ చిత్రాల తర్వాత ఇప్పుడు
ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్లో చేస్తున్న చిత్రాన్ని కూడా రిలయన్స్తో
కలిసి నిర్మిస్తున్నారు. వరస హిట్ చిత్రాలతో మంచి ఊపు మీద వున్న రకుల్
ప్రీత్ సింగ్ ఈ చిత్రంలో ఎన్టీఆర్తో జతకడుతుంది.
అత్తారింటికి దారేది చిత్రం తర్వాత తమ బేనర్లో ఇది మరో సూపర్హిట్
చిత్రమవుతుందని నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ చాలా కాన్ఫిడెంట్గా
వున్నాడు.
ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ
చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, కోప్రొడ్యూసర్: భోగవల్లి బాపినీడు,
సమర్పణ: రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్, నిర్మాత:
బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: సుకుమార్.
No comments
Post a Comment